Thursday, 15 January 2026 07:36:49 AM
 BREAKING NEWS
     -> చైనా మాంజా తాకి యువకుడికి తీవ్ర గాయం యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఘటన..      -> మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ఇక్ఫాయ్ విద్యార్థులు మృతి యువతకి తీవ్ర గాయాలు ..      -> గోపన్ పల్లి లో బెల్ట్ షాపు వద్ద గలాట ఇరు వర్గాలు పరస్పర దాడులు 18 మంది పై కేసు నమోదు..      -> జిహెచ్ఎంసి వార్డుల డిలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల 12 జోన్లు 60 సర్కిళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన ..      -> ఆ ఊర్లో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకం పై నిషేధం - జనవరి 26 నుంచి అమలు..      -> అంగట్లో సరుకుల్లా శిశువుల అక్రమ రవాణా - మియాపూర్ లో పట్టుబడ్డ 11 మంది సభ్యుల ముఠా - అహ్మదాబాద్, రామాయంపేటలో శిశువుల కొనుగోలు ..      -> చందా నాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులకు అస్వస్థత..      -> దేవుని మాన్యం లో కాసుల వల బడా బిల్డర్ డబ్బు పంపిణీ తో ఊరంతా పండగే..      -> గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో 25 మంది మృతి, ఆరుగురికి గాయాలు ..      -> ప్రయాణికులకు రూ.610 కోట్లు చెల్లించిన ఇండిగో విమాన సంస్థ..      -> ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్..      -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..      -> ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత ... గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు..      -> మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం....      -> గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్ ..      -> చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన ..

శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా

హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు


Date : 17 November 2025 10:45 PM Views : 131

సైబర్ సిటీ న్యూస్ - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : గచ్చిబౌలి ప్రధాన రహదారికి ఆనుకుని పర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో సంధ్యా శ్రీధరరావు నిర్మించిన పలు అక్రమ కట్టడాలను సోమవారం హైడ్రా నేలమట్టం చేసింది. లే ఔట్లో రహదారులు, పార్కులను పట్టించుకోకుండా చేపట్టిన నిర్మాణాలపై హైకోర్టు ఉత్తర్వులతో హైడ్రా చర్యలుతీసుకుంది. 40 అడుగుల రోడ్డుకు అడ్డంగా ఐరన్ ఫ్రేమ్తో నిర్మించిన 5 అంతస్తుల భవనం, మ్యాంగో ఫుడ్ కోర్టును కూడా తొలగించింది. మరో చోట 40 ఫీట్ రహదారిపై నిర్మించిన యూనో ఫుడ్ కోర్టును కూడా తొలగించి రోడ్లకు మార్గం సుగమం చేసింది. 40 ఫీట్ల రహదారిని కలిపేసి నిర్మించిన పెట్రోల్ బంక్ ను పాక్షికంగా తొలగించింది. రెండు చోట్ల 25 ఫీట్ల రహదారులపై ఏర్పాటు చేసిన 40 వరకు ఉన్న ఫుడ్ కంటైనర్లతో పాటు చైనా ఫుడ్ కోర్టులను తొలగించింది. 40 ఫీట్ల రహదారిపైకి జరిగి నిర్మించిన ఆసుపత్రి భవనం కోసం డబుల్ సెల్లార్ ర్యాంపులను కూల్చివేసింది. 7 చోట్ల రహదారులను ఆక్రమించి నిర్మించిన పలు కట్టడాలను తొలగించింది. హైకోర్టు ఆదేశాల మేరకు లే ఔట్లోని రహదారులను హైడ్రా పునరుద్ధరించనుంది.

గచ్చిబౌలిలోని ఫెర్టిలై జర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లే ఔట్ లో సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధరరావు ఆక్రమణలను హైకోర్టు తప్పు పట్టింది. రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడాన్ని సీరియస్ గా పరిగణించింది. లేఔట్ లోని రోడ్లను పునరుద్ధరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. 1981లో గచ్చిబౌలి సర్వేనెంబర్ 124, 125 పార్ట్ లో నీ 20 ఎకరాల పరిధిలో వేసిన లేఔట్ ప్లాట్లుండగా 119 ప్లాట్లను శ్రీధర్ రావు కొనుగోలు చేశారు. లేఔట్ స్వరూపాన్ని మార్చి ఇస్తానుసారంగా రోడ్లను ఆక్రమించి అనుమతులు పొందారు. గతంలో ఆక్రమణలు తొలగించడంపై సంధ్యాశ్రీధరరావు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు రోడ్లను పునరుద్ధరించడం అవసరమని చెప్పడం గమనార్హం. తమ ప్లాట్లకు వెళ్లేందుకు రోడ్డు లేకుండా చేశారని ప్లాట్ల యజమానులు శ్రీధర్ రావు పై హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో గత మే 5న హైడ్రా ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ సొసైటీలో శ్రీధర్ రావు చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. 1981లో వేసిన లేఔట్ లో ఉన్న రోడ్లను మార్చాలని గుర్తించి పాత రోడ్లకు మార్కింగ్ ఇచ్చింది. రోడ్లకు అడ్డంగా నిర్మాణాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని హైడ్రాధికారులు జిహెచ్ఎంసి కి లేఖ రాశారు. నిబంధనలను లెక్కచేయకుండా శ్రీధర్ రావు నాలుగు నెలలుగా యధేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు. ప్లాట్ల యజమానులకు రోడ్లు లేవని మొత్తుకున్న పట్టించుకోకపోవడంతో మరోసారి బాధితులు హైడ్రా అధికారులను కలిశారు. మరోపక్క హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో తాజాగా హైడ్రా పెద్ద మొత్తంలో శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలను కూల్చి వేసింది.

Cyber City News

Admin

Copyright © Cyber City News 2026. All right Reserved.