Thursday, 15 January 2026 07:38:39 AM
 BREAKING NEWS
     -> చైనా మాంజా తాకి యువకుడికి తీవ్ర గాయం యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఘటన..      -> మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ఇక్ఫాయ్ విద్యార్థులు మృతి యువతకి తీవ్ర గాయాలు ..      -> గోపన్ పల్లి లో బెల్ట్ షాపు వద్ద గలాట ఇరు వర్గాలు పరస్పర దాడులు 18 మంది పై కేసు నమోదు..      -> జిహెచ్ఎంసి వార్డుల డిలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల 12 జోన్లు 60 సర్కిళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన ..      -> ఆ ఊర్లో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకం పై నిషేధం - జనవరి 26 నుంచి అమలు..      -> అంగట్లో సరుకుల్లా శిశువుల అక్రమ రవాణా - మియాపూర్ లో పట్టుబడ్డ 11 మంది సభ్యుల ముఠా - అహ్మదాబాద్, రామాయంపేటలో శిశువుల కొనుగోలు ..      -> చందా నాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులకు అస్వస్థత..      -> దేవుని మాన్యం లో కాసుల వల బడా బిల్డర్ డబ్బు పంపిణీ తో ఊరంతా పండగే..      -> గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో 25 మంది మృతి, ఆరుగురికి గాయాలు ..      -> ప్రయాణికులకు రూ.610 కోట్లు చెల్లించిన ఇండిగో విమాన సంస్థ..      -> ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్..      -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..      -> ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత ... గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు..      -> మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం....      -> గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్ ..      -> చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన ..

ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు

విచారణకు ఆదేశించిన అమిత్ షా


Date : 10 November 2025 09:27 PM Views : 171

సైబర్ సిటీ న్యూస్ - జాతీయం / హైదరాబాద్ : దేశ రాజధాని పేలుడు తో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సోమవారం సాయంత్రం 6.52 గంటల సమయంలోఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 సమయంలో సుభాష్ మార్క్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద i 20 కారులో పేలుడు సంభవించింది. పేలుడుతో 9 మంది మరణించగా మరో 20 మందికి పైగా గాయపడినట్లుగా తెలుస్తోంది. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా చిత్రమైపోయాయి. సమీప ప్రాంతాల్లోని పేలుడు దాటికి వీధిలైట్లు పగిలిపోయి అందాకారం నెలకొంది. భారీ శబ్దంతో సంభవించిన పేలుడు తో సమీపం లోని వాహనాలకు నిప్పంటుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడడంతో ఏడు ఫైరింజలతో మంటలు ఆర్పుతున్నారు. గాయపడ్డ క్షతగాత్రులను సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు.

ఎర్రకోట వద్ద సంబందించిన పేలుడుపై సమగ్ర విచారణకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించారు. ఎన్ఐఏ, ఎం ఎస్ జి బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. సోమవారం ఎర్రకోట సందర్శనకు సెలవు కావడంతో భారీ ప్రాణ నష్టం తప్పినట్లు అయ్యింది. పేలుడు పై ప్రధాని మోదీ ఆరా తీశారు. అమిత్ షా కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పేలుడు ఘటనతో దేశంలోని ప్రధాన నగరాలతో పాటు పట్టణాలలో పోలీసులు ప్రకటించారు. విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. పేలుడు జరిగిన కొద్దిసేపటికి ఢిల్లీ పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Cyber City News

Admin

Copyright © Cyber City News 2026. All right Reserved.