Thursday, 15 January 2026 07:31:37 AM
 BREAKING NEWS
     -> చైనా మాంజా తాకి యువకుడికి తీవ్ర గాయం యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఘటన..      -> మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ఇక్ఫాయ్ విద్యార్థులు మృతి యువతకి తీవ్ర గాయాలు ..      -> గోపన్ పల్లి లో బెల్ట్ షాపు వద్ద గలాట ఇరు వర్గాలు పరస్పర దాడులు 18 మంది పై కేసు నమోదు..      -> జిహెచ్ఎంసి వార్డుల డిలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల 12 జోన్లు 60 సర్కిళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన ..      -> ఆ ఊర్లో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకం పై నిషేధం - జనవరి 26 నుంచి అమలు..      -> అంగట్లో సరుకుల్లా శిశువుల అక్రమ రవాణా - మియాపూర్ లో పట్టుబడ్డ 11 మంది సభ్యుల ముఠా - అహ్మదాబాద్, రామాయంపేటలో శిశువుల కొనుగోలు ..      -> చందా నాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులకు అస్వస్థత..      -> దేవుని మాన్యం లో కాసుల వల బడా బిల్డర్ డబ్బు పంపిణీ తో ఊరంతా పండగే..      -> గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో 25 మంది మృతి, ఆరుగురికి గాయాలు ..      -> ప్రయాణికులకు రూ.610 కోట్లు చెల్లించిన ఇండిగో విమాన సంస్థ..      -> ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్..      -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..      -> ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత ... గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు..      -> మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం....      -> గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్ ..      -> చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన ..

గోపన్ పల్లి లో బెల్ట్ షాపు వద్ద గలాట ఇరు వర్గాలు పరస్పర దాడులు 18 మంది పై కేసు నమోదు


Date : 02 January 2026 07:18 PM Views : 54

సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : గోపనపల్లిలోని మద్యం బెల్ట్ షాపు వద్ద అర్ధరాత్రి గలాట చోటుచేసుకుంది. ఇరువర్గాలు బాబాయ్కి దిగాయి. వర్గం వారు ఇనుప రాడ్లతో దాడికి పాల్పడడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బీరు సీసా కు రూ.50 ఎక్కువగా చెప్పడంతో వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చందానగర్ పీఎస్ పరిధిలో గోపనపల్లి తండాలో నానక్రం కూడా చెందిన కార్తిక్, ప్రకాశం లో కొంతకాలంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

గురువారం రాత్రి ఎన్టీఆర్ నగర్లో ఓ స్థానిక నాయకుడు బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. అక్కడ మద్యం సేవించిన కొంతమంది అర్ధరాత్రి 2 గంటల సమయంలో బెల్ట్ షాపుకు వెళ్లారు. మీరు కావాలని అడగగా 50 రూపాయలు ఎక్కువ ఇవ్వాలని తెలపడంతో గొడవ దిగారు. బెల్ట్ షాప్ నిర్వాహకులను తోయడం, షాప్ పై దాడికి పాల్పడడంతో గొడవ ముదిరిపాకన పడింది. కార్తీక్, ప్రకాశం మరో నలుగురు ఇనుపరాట్లతో మద్యం మత్తులో ఉన్న వారిపై దాడికి పాల్పడ్డారు. గోపనపల్లికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అక్రమంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తులు స్థానికుల అయిన తమపై దాడికి పాల్పడడం ఏమిటని గ్రామస్తులంతా ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం ఉదయం చందానగర్ ఎస్సై ఆంజనేయులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్తులపై దాడికి పాల్పడిన కార్తీక్, ప్రకాశం సింగ్ తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. బెల్ట్ షాప్ పై గలాటకు దిగిన ఘటనలో సురేందర్ తో పాటు మరో పదకొండు మందిపై కేసు నమోదు చేశారు. బెల్ట్ షాప్ లో మద్యంతో పాటు గంజాయి వెక్కిరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే గోపనపల్లి తండాలో వైన్ షాప్ వద్ద ప్రతిరోజు పదుల సంఖ్యలో ప్రధాన రహదారి వెంట బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ హల్చల్ చేస్తున్న వారిని కట్టడి చేయడంలో చందానగర్ పోలీసులు విఫలమయ్యారని స్థానికులు విమర్శిస్తున్నారు. అటు వైపు వెళ్లాలంటేనే మహిళలు జంతువుతున్నారని వాపోతున్నారు.

Cyber City News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Cyber City News 2026. All right Reserved.