Wednesday, 04 March 2026 01:21:35 PM
 BREAKING NEWS
     -> . 2200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా - 11 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి స్వాధీనం - మొండికుంట‌ చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌ - ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు..      -> హెచ్ సి యు లో 50 ల్యాప్ టాప్ల చోరీ సి ఆర్ రావు ఇనిస్టిట్యూట్ లో ఘటన సెక్యూరిటీ కళ్ళు కప్పి చోరీ ..      -> కూలిన విమానం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం బారామతిలో ల్యాండ్ అవుతుండగా ఘటన..      -> ఫాస్టాగ్ ఉంటేనే బండి కదులుతుంది ఏప్రిల్ ఒకటి నుంచి ఫాస్ట్ ట్రాక్ తప్పనిసరి ..      -> చైనా మాంజా తాకి యువకుడికి తీవ్ర గాయం యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఘటన..      -> మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ఇక్ఫాయ్ విద్యార్థులు మృతి యువతకి తీవ్ర గాయాలు ..      -> గోపన్ పల్లి లో బెల్ట్ షాపు వద్ద గలాట ఇరు వర్గాలు పరస్పర దాడులు 18 మంది పై కేసు నమోదు..      -> జిహెచ్ఎంసి వార్డుల డిలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల 12 జోన్లు 60 సర్కిళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన ..      -> ఆ ఊర్లో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకం పై నిషేధం - జనవరి 26 నుంచి అమలు..      -> అంగట్లో సరుకుల్లా శిశువుల అక్రమ రవాణా - మియాపూర్ లో పట్టుబడ్డ 11 మంది సభ్యుల ముఠా - అహ్మదాబాద్, రామాయంపేటలో శిశువుల కొనుగోలు ..      -> చందా నాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులకు అస్వస్థత..      -> దేవుని మాన్యం లో కాసుల వల బడా బిల్డర్ డబ్బు పంపిణీ తో ఊరంతా పండగే..      -> గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో 25 మంది మృతి, ఆరుగురికి గాయాలు ..      -> ప్రయాణికులకు రూ.610 కోట్లు చెల్లించిన ఇండిగో విమాన సంస్థ..      -> ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్..      -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..

జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ని గెలిపించాలి

గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి


Date : 22 October 2025 09:07 PM Views : 142

సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి షేక్‌పేట్ డివిజన్‌ లోని ఓయూ కాలనీలో ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. యువతకు ఉద్యోగాలు, గృహ నిర్మాణ హామీలు, మహిళలకు భద్రత వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే, పారదర్శక పాలన కొనసాగాలంటే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలిపించాలన్నారు.బీజేపీ మాత్రమే ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందన్నారు. అభివృద్ధి దిశగా భారత్‌ను ముందుకు తీసుకువెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం ప్రజల విశ్వాసం చూరగొన్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయడం ప్రజలు బాధ్యత గా భావించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు శివ సింగ్ రాందీన్, సీనియర్ నాయకులు స్వామి గౌడ్, నరసింహరావు, అనిల్ గౌడ్, సంజీవ్, వరలక్ష్మి ధీరజ్, నరసింహ రాజు, నరేందర్ ముదిరాజ్, అశోక్, సురేష్, దుర్గారామ్, రాఘవేంద్ర, జితేందర్ సింగ్, విశాల్ సింగ్,స్థానిక బీజేపీ నాయకులు,బూత్ అధ్యక్షులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Cyber City News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Cyber City News 2026. All right Reserved.