Thursday, 27 November 2025 07:18:55 PM
 BREAKING NEWS
     -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..      -> ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత ... గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు..      -> మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం....      -> గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్ ..      -> చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన ..      -> కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ...జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్..      -> కాశీ బుగ్గ తొక్కిసలాటలో 9 మృతి,మృతుల సంఖ్య పెరిగే అవకాశం..      -> మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు భారత్ ..      -> హైదరాబాద్ కు తుఫాన్ ఎఫెక్ట్ ..      -> కెరటంలా దూసుకొస్తున్న మోంథా తుఫాన్..      -> మియాపూర్ డిపో, బస్ బాడీలలో ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి ఆకస్మిక తనిఖీ ..      -> ఉత్సాహంగా ఉమెన్స్ నైట్ రన్..      -> దొంగలపై డీసీపీ కాల్పులు... ఒకరికి గాయాలు..      -> వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం... 20 మంది కి పైగా మృతి..      -> జూబ్లీహిల్స్ లో 81 నామినేషన్లకు ఆమోదం ..      -> జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ని గెలిపించాలి..

జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ని గెలిపించాలి

గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి


Date : 22 October 2025 09:07 PM Views : 62

సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి షేక్‌పేట్ డివిజన్‌ లోని ఓయూ కాలనీలో ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. యువతకు ఉద్యోగాలు, గృహ నిర్మాణ హామీలు, మహిళలకు భద్రత వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే, పారదర్శక పాలన కొనసాగాలంటే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలిపించాలన్నారు.బీజేపీ మాత్రమే ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందన్నారు. అభివృద్ధి దిశగా భారత్‌ను ముందుకు తీసుకువెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం ప్రజల విశ్వాసం చూరగొన్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయడం ప్రజలు బాధ్యత గా భావించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు శివ సింగ్ రాందీన్, సీనియర్ నాయకులు స్వామి గౌడ్, నరసింహరావు, అనిల్ గౌడ్, సంజీవ్, వరలక్ష్మి ధీరజ్, నరసింహ రాజు, నరేందర్ ముదిరాజ్, అశోక్, సురేష్, దుర్గారామ్, రాఘవేంద్ర, జితేందర్ సింగ్, విశాల్ సింగ్,స్థానిక బీజేపీ నాయకులు,బూత్ అధ్యక్షులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Cyber City News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Cyber City News 2025. All right Reserved.