సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / హైదరాబాద్ : ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో లాప్టాప్ ల చోరీ చేస్తున్న నమోదైంది. 25 లక్షల విలువైన ఈ 50 ల్యాప్టాప్ లను చోరీ చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. విద్యార్థులు ప్రాక్టీస్ చేసేందుకు ల్యాప్ టాప్ లను శుక్రవారం క్లాస్ రూమ్ లో పెట్టారు. శని ఆదివారాలు సెలవు కావడంతో సోమవారం సిబ్బంది క్లాస్ రూముకు వెళ్లి చూడగా కంప్యూటర్లు కనిపించలేదు. కిటికీ గ్రిల్స్ తొలగించి ఉండటం, ల్యాప్ టాప్ కనిపించకపోవడంతో కంగు తిన్నారు. గ్రిల్స్ తొలగించిన గుర్తు తెలియని వ్యక్తులు లాప్టాప్ లను కారులో తరలించినట్లుగా పోలీసులు గుర్తించారు. క్యాంపస్ లోని సీసీటీవీ ఫుటేజ్ లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
సెక్యూరిటీ విఫలం యూనివర్సిటీ ద్వారాలతో పాటు క్యాంపస్ లోపల సెక్యూరిటీ గార్డులో నిరంతరం కాపలా ఉంటారు. వారందరి కళ్ళు కప్పి ఎలా చూరి చేశారో అర్థం కావడం లేదు. లాప్టాప్ లు క్లాస్ రూమ్ లో ఉన్నాయని తెలిసిన వారే చేతివాటం ప్రదర్శించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బయట వ్యక్తులను లోపలికి అనుమతించేందుకు యక్ష ప్రశ్నలు వేసే సెక్యూరిటీ విభాగం పటిష్టమైన చర్యలు తీసుకోవడం విఫలమైందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. గచ్చిబౌలి పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Cyber City NewsAdmin