Thursday, 15 January 2026 08:50:35 AM
 BREAKING NEWS
     -> చైనా మాంజా తాకి యువకుడికి తీవ్ర గాయం యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఘటన..      -> మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ఇక్ఫాయ్ విద్యార్థులు మృతి యువతకి తీవ్ర గాయాలు ..      -> గోపన్ పల్లి లో బెల్ట్ షాపు వద్ద గలాట ఇరు వర్గాలు పరస్పర దాడులు 18 మంది పై కేసు నమోదు..      -> జిహెచ్ఎంసి వార్డుల డిలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల 12 జోన్లు 60 సర్కిళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన ..      -> ఆ ఊర్లో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకం పై నిషేధం - జనవరి 26 నుంచి అమలు..      -> అంగట్లో సరుకుల్లా శిశువుల అక్రమ రవాణా - మియాపూర్ లో పట్టుబడ్డ 11 మంది సభ్యుల ముఠా - అహ్మదాబాద్, రామాయంపేటలో శిశువుల కొనుగోలు ..      -> చందా నాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులకు అస్వస్థత..      -> దేవుని మాన్యం లో కాసుల వల బడా బిల్డర్ డబ్బు పంపిణీ తో ఊరంతా పండగే..      -> గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో 25 మంది మృతి, ఆరుగురికి గాయాలు ..      -> ప్రయాణికులకు రూ.610 కోట్లు చెల్లించిన ఇండిగో విమాన సంస్థ..      -> ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్..      -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..      -> ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత ... గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు..      -> మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం....      -> గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్ ..      -> చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన ..

చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన

టిప్పర్ బస్సు పైకి వరగడంతో కంకరతో నిండిన బస్సు . ఊపిరాడక స్పాట్ లోనే చనిపోయిన కొందరు ప్రయాణికులు .మరో 30 మందికి తీవ్ర గాయాలు .శవాల గుట్ట గా మారిన చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి


Date : 03 November 2025 10:58 AM Views : 152

సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / హైదరాబాద్ : చేవెళ్లలోనే మీర్జాగూడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాండూర్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న కంకర లోడ్ తో టిప్పర్ ఢీ కొట్టింది. టిప్పర్ బస్సు పైకి వరగడంతో కంకర తో బస్సు నిండిపోయింది. కొంతమంది ప్రయాణికులు కంకరలో కూరుకుపోవడంతో కొందరు ఊపిరాడక స్పాట్ లోనే చనిపోయారు. మరి కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 25 మంది మృతి చెందగా మరో 32 మంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చేవెళ్లలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను ఉంచారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించనున్నారు. క్షతగాత్రులకు అక్కడే చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ వారిని హైదరాబాద్ కు తరలించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు

తాండూరు డిపోకు చెందిన బస్సు ఉదయం నాలుగు గంటల 40 నిమిషాల సమయంలో హైదరాబాద్ కు బయలుదేరింది. దాదాపు 70 మంది ప్రయాణికులు బస్సులు ఉన్నట్లు తెలుస్తోంది. చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద ఎదురుగా వస్తున్న కంకర లోడ్ టిప్పర్ ఉదయం 6.15 గంటలకు ఢీ కొట్టింది. కంకర పూర్తిగా బస్సులో పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర గాయాలు. మృతులతో పాటు క్షతగాత్రులను పోలీసులు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు బయటికి తీశాయి. ప్రయాణికులతో పాటు ఆర్టీసీ బస్సు, టిప్పర్ డ్రైవర్లు మృతి చెందారు. బస్సులో ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎల్లయ్య అనే వ్యక్తికి చెందిన ముగ్గురు కూతుళ్లు ఈ బస్సు ప్రమాదంలో మృతి చెందారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. హైదరాబాద్ నుంచి బీజాపూర్ హైవేగా మార్చినప్పటికీ రోడ్డును విస్తరించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ఇరుకుగా ఉండడం, లోతైన గుంత ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ఘటనా స్థలానికి వెళ్లగా నిరసన వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 7 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షలు ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. మీర్జాగూడ ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చేవెళ్ల ప్రమాదం ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Cyber City News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Cyber City News 2026. All right Reserved.