Thursday, 15 January 2026 08:49:42 AM
 BREAKING NEWS
     -> చైనా మాంజా తాకి యువకుడికి తీవ్ర గాయం యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఘటన..      -> మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ఇక్ఫాయ్ విద్యార్థులు మృతి యువతకి తీవ్ర గాయాలు ..      -> గోపన్ పల్లి లో బెల్ట్ షాపు వద్ద గలాట ఇరు వర్గాలు పరస్పర దాడులు 18 మంది పై కేసు నమోదు..      -> జిహెచ్ఎంసి వార్డుల డిలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల 12 జోన్లు 60 సర్కిళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన ..      -> ఆ ఊర్లో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకం పై నిషేధం - జనవరి 26 నుంచి అమలు..      -> అంగట్లో సరుకుల్లా శిశువుల అక్రమ రవాణా - మియాపూర్ లో పట్టుబడ్డ 11 మంది సభ్యుల ముఠా - అహ్మదాబాద్, రామాయంపేటలో శిశువుల కొనుగోలు ..      -> చందా నాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులకు అస్వస్థత..      -> దేవుని మాన్యం లో కాసుల వల బడా బిల్డర్ డబ్బు పంపిణీ తో ఊరంతా పండగే..      -> గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో 25 మంది మృతి, ఆరుగురికి గాయాలు ..      -> ప్రయాణికులకు రూ.610 కోట్లు చెల్లించిన ఇండిగో విమాన సంస్థ..      -> ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్..      -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..      -> ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత ... గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు..      -> మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం....      -> గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్ ..      -> చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన ..

ఏఐజి ఆసుపత్రిలో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం చేరిన వ్యక్తి మృతి


Date : 12 October 2025 10:30 AM Views : 190

సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / హైదరాబాద్ : బాధిత కుటుంబ సభ్యులు ఏఐజి ముందు ధర్నా సైబర్ సిటీ న్యూస్(హైదరాబాద్): గచ్చిబౌలిలోని ఏ ఏజీ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. లివర్ ప్లాంటేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన వ్యక్తి సర్జరీ తర్వాత మృతి చెందారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రాణం పోయిందని, బిల్లు ఎక్కువగా వేశారని రోగి బంధువులు ఆందోళనకు దిగారు. మాదాపూర్ డిసిపి రీతు రాజ్ ఆందోళనకారులకు సర్దు చెప్పి కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు

ఇది ముమ్మాటికి నిర్లక్ష్యమే.... చింతల కు చెందిన మురళి (40) లివర్ చెడిపోవడంతో ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఆగస్టు 26న గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చేరారు. లివర్ను డోనర్ చేసేందుకు మురళి భార్య ముందుకు వచ్చారు. మొత్తం 35 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పగా అందుకు వారు అంగీకరించారు. ఆగస్టు 28న మురళికి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. అప్పటినుంచి ఆయన పూర్తిగా కోలుకోకపోవడంతో ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆరోగ్యం క్షమించడంతో శనివారం రాత్రి మురళి మృతి చెందారు. ఆస్పత్రి యాజమాన్యం 49 లక్షల బిల్లు వేసింది. ఇప్పటికే 35 లక్షలు చెల్లించిన బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే మురళి మృతి చెందారని అధికంగా బిల్లు వేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే లివర్ కోసం మురళి కుటుంబ సభ్యులు జీవన్ డాన్ కు దరఖాస్తు చేసుకున్నారు. డాక్టర్లు ఆయన వయస్సు 40 కు బదులు 60 వేయడంతో డోనర్లు ముందుకు రాలేదని తెలిపారు. జీవన్దాన్ లో అవకాశం వస్తే 7 లక్షల బిల్లు తగ్గేదన్నారు. ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే జీవం దాన్లో అవకాశం కోల్పోయామన్నారు. ఇదిలా ఉంటే బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని రాయదుర్గం ఇన్స్పెక్టర్ సిహెచ్ వెంకన్న తెలిపారు.

Nag

Admin

మరిన్ని వార్తలు

Copyright © Cyber City News 2026. All right Reserved.