Thursday, 15 January 2026 08:51:57 AM
 BREAKING NEWS
     -> చైనా మాంజా తాకి యువకుడికి తీవ్ర గాయం యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఘటన..      -> మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ఇక్ఫాయ్ విద్యార్థులు మృతి యువతకి తీవ్ర గాయాలు ..      -> గోపన్ పల్లి లో బెల్ట్ షాపు వద్ద గలాట ఇరు వర్గాలు పరస్పర దాడులు 18 మంది పై కేసు నమోదు..      -> జిహెచ్ఎంసి వార్డుల డిలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల 12 జోన్లు 60 సర్కిళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన ..      -> ఆ ఊర్లో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకం పై నిషేధం - జనవరి 26 నుంచి అమలు..      -> అంగట్లో సరుకుల్లా శిశువుల అక్రమ రవాణా - మియాపూర్ లో పట్టుబడ్డ 11 మంది సభ్యుల ముఠా - అహ్మదాబాద్, రామాయంపేటలో శిశువుల కొనుగోలు ..      -> చందా నాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులకు అస్వస్థత..      -> దేవుని మాన్యం లో కాసుల వల బడా బిల్డర్ డబ్బు పంపిణీ తో ఊరంతా పండగే..      -> గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో 25 మంది మృతి, ఆరుగురికి గాయాలు ..      -> ప్రయాణికులకు రూ.610 కోట్లు చెల్లించిన ఇండిగో విమాన సంస్థ..      -> ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్..      -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..      -> ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత ... గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు..      -> మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం....      -> గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్ ..      -> చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన ..

స్విమ్మింగ్ పూల్ పడి బాలుడు మృతి

ఆడుకుంటూ వెళ్లి జారి పడటంతో ఘటన


Date : 13 October 2025 07:26 PM Views : 139

సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / హైదరాబాద్ : గచ్చిబౌలి: ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు జారి పడటంతో బాలుడు మృతి చెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నేపాల్ కు చెందిన దంపతులు మహేందర్ రావు, నిర్మల బతుకు దెరువు కోసం నగరానికి వలస వచ్చారు. మసీద్ బండ లోని పారామౌంట్ హిల్స్ కాలనీ ది క్లబ్ మినీ గేటెడ్ కమ్యూనిటీలో వాచ్మెన్ గా పని చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 2.53 గంటల సమయంలో మహేందర్ కొడుకు సూరజ్ రోత్ (04) ఆడుకుంటూ బయటకు వెళ్లాడు. ఆడుకుంటూ వెళుతూ ప్రమాదవశాత్తు జారి స్విమ్మింగ్ పూల్ లో పడ్డాడు. కొద్ది సేపటి తరువాత ఇంట్లో లేకపోవడంతో తల్లి నిర్మల కొడుకు సూరజ్ కోసం వెతికింది. స్విమ్మింగ్ పూల్ లో పడి ఉండటాన్ని గమనించి బయటకు తీశారు .

వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు అక్కడి వైద్యులు దృవీకరించారు. ఒక్కగా నొక్క కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు గా విలపించారు. బాలుడు మృతదేహనికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆడుకుంటూ వెళ్లి బాలుడు స్విమ్మింగ్ పూల్లో పడ్డట్లు సీ సీ కెమెరా ఫుటేజ్ లో ఉందని. పోలీసులు తెలిపారు. స్విమ్మింగ్ పిల్లలు పూల్ వైపు వెళ్ళకుండా రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించారు.

Cyber City News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Cyber City News 2026. All right Reserved.