Thursday, 15 January 2026 07:38:35 AM
 BREAKING NEWS
     -> చైనా మాంజా తాకి యువకుడికి తీవ్ర గాయం యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఘటన..      -> మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ఇక్ఫాయ్ విద్యార్థులు మృతి యువతకి తీవ్ర గాయాలు ..      -> గోపన్ పల్లి లో బెల్ట్ షాపు వద్ద గలాట ఇరు వర్గాలు పరస్పర దాడులు 18 మంది పై కేసు నమోదు..      -> జిహెచ్ఎంసి వార్డుల డిలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల 12 జోన్లు 60 సర్కిళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన ..      -> ఆ ఊర్లో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకం పై నిషేధం - జనవరి 26 నుంచి అమలు..      -> అంగట్లో సరుకుల్లా శిశువుల అక్రమ రవాణా - మియాపూర్ లో పట్టుబడ్డ 11 మంది సభ్యుల ముఠా - అహ్మదాబాద్, రామాయంపేటలో శిశువుల కొనుగోలు ..      -> చందా నాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులకు అస్వస్థత..      -> దేవుని మాన్యం లో కాసుల వల బడా బిల్డర్ డబ్బు పంపిణీ తో ఊరంతా పండగే..      -> గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో 25 మంది మృతి, ఆరుగురికి గాయాలు ..      -> ప్రయాణికులకు రూ.610 కోట్లు చెల్లించిన ఇండిగో విమాన సంస్థ..      -> ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్..      -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..      -> ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత ... గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు..      -> మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం....      -> గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్ ..      -> చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన ..

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే


Date : 17 November 2025 11:23 PM Views : 130

సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / హైదరాబాద్ : సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు మృతి చెందారు. మృతుల్లో మల్లెపల్లి,బజార్ ఘాట్, విద్యానగర్ కు చెందిన వారు ఉన్నారు. హైదరాబాద్ నుంచి మక్కాకు బయలుదేరారు. మెహిదీపట్నంలోని ఫ్లై జోన్ ఏజెన్సీ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని నవంబర్ 9న మక్కాకు వెళ్లారు. మక్కా యాత్ర పూర్తి చేసుకుని మదినకు వెళ్తున్న సమయంలో ట్రావెల్ బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు మంటల్లో కాలిపోవడంతో హైదరాబాద్ వాసులంతా సజీవ దహనం అయ్యారు. మృతుల్లో మరియు ఫాతిమా, సారావేగం, షహనాజ్ బేగం, షాకత్ బేగం, మహమ్మద్ మౌలానా, సారా మహమ్మద్, సహజిన్ బేగం, సలావుద్దీన్ షేక్, మస్తాన్ మహమ్మద్, జాకియా బేగం, మహమ్మద్ అలీ జిర్రా, రహీమున్నీసా, గౌసియా బేగం, అత్తర్ బేగం, నసీరుద్దీన్ షేక్, అబ్దుల్ కదిర్, అబ్దుల్ సోహెబ్ మహమ్మద్, ఉమేరా నాజ్నిన్, రైస్ బేగం, ఉమేజా ఫాతిమా, సనా సుల్తానా, రిజ్వానా బేగం, ఫార్విన్ బేగం ఉన్నారు.

సౌదీ అరేబియా లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాదులోనే విద్యానగర్కు చెందిన నజీరుద్దిన్ కుటుంబంలో 18 మంది మృతి చెందారు. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి అయిన నజీరుద్దీన్ కుటుంబ సభ్యులతో కలిసి మక్కా యాత్రకు వెళ్లారు. ఒకే కుటుంబంలో 18 మంది మృతి చెందడాన్ని వారి బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాధ్యత కుటుంబ బంధువులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. సౌదీ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల పరిహారం ప్రకటించింది. మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగానికి చెందిన అధికారితో కూడిన బృందాన్ని సౌదీకి పంపించాలని సూచించింది. మృతదేహాలకు వారి సాంప్రదాయాల ప్రకారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు చొప్పున తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

Cyber City News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Cyber City News 2026. All right Reserved.