Wednesday, 04 March 2026 01:15:47 PM
 BREAKING NEWS
     -> . 2200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా - 11 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి స్వాధీనం - మొండికుంట‌ చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌ - ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు..      -> హెచ్ సి యు లో 50 ల్యాప్ టాప్ల చోరీ సి ఆర్ రావు ఇనిస్టిట్యూట్ లో ఘటన సెక్యూరిటీ కళ్ళు కప్పి చోరీ ..      -> కూలిన విమానం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం బారామతిలో ల్యాండ్ అవుతుండగా ఘటన..      -> ఫాస్టాగ్ ఉంటేనే బండి కదులుతుంది ఏప్రిల్ ఒకటి నుంచి ఫాస్ట్ ట్రాక్ తప్పనిసరి ..      -> చైనా మాంజా తాకి యువకుడికి తీవ్ర గాయం యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఘటన..      -> మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ఇక్ఫాయ్ విద్యార్థులు మృతి యువతకి తీవ్ర గాయాలు ..      -> గోపన్ పల్లి లో బెల్ట్ షాపు వద్ద గలాట ఇరు వర్గాలు పరస్పర దాడులు 18 మంది పై కేసు నమోదు..      -> జిహెచ్ఎంసి వార్డుల డిలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల 12 జోన్లు 60 సర్కిళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన ..      -> ఆ ఊర్లో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకం పై నిషేధం - జనవరి 26 నుంచి అమలు..      -> అంగట్లో సరుకుల్లా శిశువుల అక్రమ రవాణా - మియాపూర్ లో పట్టుబడ్డ 11 మంది సభ్యుల ముఠా - అహ్మదాబాద్, రామాయంపేటలో శిశువుల కొనుగోలు ..      -> చందా నాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులకు అస్వస్థత..      -> దేవుని మాన్యం లో కాసుల వల బడా బిల్డర్ డబ్బు పంపిణీ తో ఊరంతా పండగే..      -> గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో 25 మంది మృతి, ఆరుగురికి గాయాలు ..      -> ప్రయాణికులకు రూ.610 కోట్లు చెల్లించిన ఇండిగో విమాన సంస్థ..      -> ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్..      -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..

కాశీ బుగ్గ తొక్కిసలాటలో 9 మృతి,మృతుల సంఖ్య పెరిగే అవకాశం

శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం


Date : 01 November 2025 02:05 PM Views : 195

సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / శ్రీకాకుళం : శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఇప్పటివరకు దాదాపు పదిమంది మృతి చెందారని, మరో 20 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కార్తీక మాసం ఏకాదశి కావడంతో కాశిబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి భక్తుల తాకిడి మొదలైంది. ఉన్నట్టుండి భక్తుల సంఖ్య అంతకంతకు పెరిగింది. రీలింగ్ విరిగిపోవడంతో భక్తులు కింద పడిపోయారు. దీంతో తోపులాట, తొక్కిసలాట జరిగింది. మహిళలు చిన్నారులు కింద పడిపోవడంతో ఊపిరి ఆడక చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

కాశీబుగ్గలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి పురస్కరించుకొని నిర్వాహకులు 3000 మంది భక్తుల కోసం ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. కార్తీక మాసం ఏకాదశి కావడంతో శనివారం దాదాపు 25 వేల మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వచ్చారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రి అచ్చన్న నాయుడు, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఘటనా స్థలంలో బాధితులను పరామర్శించారు. ఇది ఇలా ఉంటే కాశీబుగ్గలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ప్రకటించింది. ఆలయం ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న భక్తులు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ఏర్పాట్లు చేస్తే బాధ్యత ప్రభుత్వం పై ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.

Cyber City News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Cyber City News 2026. All right Reserved.