Thursday, 15 January 2026 07:32:53 AM
 BREAKING NEWS
     -> చైనా మాంజా తాకి యువకుడికి తీవ్ర గాయం యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఘటన..      -> మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ఇక్ఫాయ్ విద్యార్థులు మృతి యువతకి తీవ్ర గాయాలు ..      -> గోపన్ పల్లి లో బెల్ట్ షాపు వద్ద గలాట ఇరు వర్గాలు పరస్పర దాడులు 18 మంది పై కేసు నమోదు..      -> జిహెచ్ఎంసి వార్డుల డిలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల 12 జోన్లు 60 సర్కిళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన ..      -> ఆ ఊర్లో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకం పై నిషేధం - జనవరి 26 నుంచి అమలు..      -> అంగట్లో సరుకుల్లా శిశువుల అక్రమ రవాణా - మియాపూర్ లో పట్టుబడ్డ 11 మంది సభ్యుల ముఠా - అహ్మదాబాద్, రామాయంపేటలో శిశువుల కొనుగోలు ..      -> చందా నాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులకు అస్వస్థత..      -> దేవుని మాన్యం లో కాసుల వల బడా బిల్డర్ డబ్బు పంపిణీ తో ఊరంతా పండగే..      -> గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో 25 మంది మృతి, ఆరుగురికి గాయాలు ..      -> ప్రయాణికులకు రూ.610 కోట్లు చెల్లించిన ఇండిగో విమాన సంస్థ..      -> ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్..      -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..      -> ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత ... గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు..      -> మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం....      -> గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్ ..      -> చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన ..

ఆ ఊర్లో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకం పై నిషేధం - జనవరి 26 నుంచి అమలు


Date : 25 December 2025 07:45 AM Views : 80

సైబర్ సిటీ న్యూస్ - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : ఇది ఆధునిక ప్రపంచం. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటేనే అంత సవ్యంగా నడుస్తుందని అనుకునే వేళ. చాయ్, బిస్కట్, చాక్లెట్ కోనాలన్నా స్మార్ట్ అవసరం ఉంది. చదువు రాని వారు కూడా స్మార్ట్ ఫోన్ లో రీల్స్ , చూస్తూ, పాటలు వింటూ సేదదీరుతున్నారు. రెండేళ్ల పిల్లల నుంచి వృద్ధుల వరకు స్మార్ట్ ఫోన్ లేనిదే గడవడం లేదు. ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ పైనే నడుస్తోంది. స్మార్ట్ ఫోన్ లేనిదే ఎవరూ ఉండలేకపోతున్నారు. అన్ని పనులు ఇప్పుడు ఫోన్ పైనే జరిగిపోతున్నాయి. అందుకే.. స్మార్ట్ ఫోన్ మనిషి జీవితంలో భాగమైపోయింది. ఇప్పుడు ప్రపంచం 6జీ వైపు పరుగుపెడుతున్న వేళ. ప్రపంచం పరిస్థితి ఇలా ఉంటే.. ఆ ఊరిలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయ్. అక్కడ మహిళలు స్మార్ట్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించారు. ఆ ఊరిలోని మహిళలు, బాలికలు ఎవరూ స్మార్ట్ ఫోన్ వాడటానికి వీల్లేదు. ఈ మేరకు ఆ ఊరి పెద్దలు హుకుం జారీ చేశారు

రాజస్థాన్ రాష్ట్రం జలోర్ జిల్లాలో మహిళలు స్మార్ట్ ఫోన్ వాడకుండా నిషేధం విధించారు. వారు కేవలం కీ ప్యాడ్ ఫోన్లు మాత్రమే వాడాలని ఆదేశించారు. ప్రపంచమంతా 6జీ వైపు పరుగులు పెడుతుండగా రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలోని 15 గ్రామాలలో మహిళలను కీప్యాడ్ ఫోన్ల యుగానికి తిరిగి వెళ్లమని కోరుతున్నారు. చౌదరి వర్గానికి చెందిన సుంధమాతా పట్టి పంచాయతీ కీలక ఆదేశాలు ఇచ్చింది. మహిళలు, బాలికలు స్మార్ట్‌ఫోన్‌ల వాడకంపై నిషేధం విధించింది. మొబైల్ వ్యసనం, పిల్లల కంటిచూపుపై స్క్రీన్ల ప్రభావంపై ఆందోళనలను పేర్కొంటూ కమ్యూనిటీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. కేవలం మహిళలు, బాలికల పై నిషేధం విధించడం వేరే కారణాలు ఉండవచ్చనే చర్చ జరుగుతుంది. ఈ నిబంధన 2026 జనవరి 26 నుండి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం ప్రకారం, మహిళలు కేవలం కీప్యాడ్ ఫోన్లలను మాత్రమే ఉపయోగించడానికి అనుమతి ఉంటుంది. పెళ్లిళ్లకు, సామాజిక సమావేశాలకు లేదా పొరుగు ఊర్లు, బిందువుల ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడానికి ఇకపై అనుమతి ఉండదు. స్థానిక కమ్యూనిటీ పెద్దలు ఇచ్చిన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి. స్మార్ట్ ఫోన్లు వాడకుండా నిషేధం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆధునిక కాలంలో ఇలాంటి నిర్ణయాలు సరికాదంటున్నారు. మహిళలు, బాలికలపై వివక్ష చూపటం ఏంటని విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగిపోయిందని, వ్యసనంగా మారిందని, దాని వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయని, కంటి చూపు సమస్యలు వస్తున్నాయని, ఇది చక్కని నిర్ణయం అని సమర్థించే వాళ్లూ ఉన్నారు.

Cyber City News

Admin

Copyright © Cyber City News 2026. All right Reserved.