Thursday, 27 November 2025 07:18:57 PM
 BREAKING NEWS
     -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..      -> ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత ... గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు..      -> మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం....      -> గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్ ..      -> చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన ..      -> కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ...జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్..      -> కాశీ బుగ్గ తొక్కిసలాటలో 9 మృతి,మృతుల సంఖ్య పెరిగే అవకాశం..      -> మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు భారత్ ..      -> హైదరాబాద్ కు తుఫాన్ ఎఫెక్ట్ ..      -> కెరటంలా దూసుకొస్తున్న మోంథా తుఫాన్..      -> మియాపూర్ డిపో, బస్ బాడీలలో ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి ఆకస్మిక తనిఖీ ..      -> ఉత్సాహంగా ఉమెన్స్ నైట్ రన్..      -> దొంగలపై డీసీపీ కాల్పులు... ఒకరికి గాయాలు..      -> వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం... 20 మంది కి పైగా మృతి..      -> జూబ్లీహిల్స్ లో 81 నామినేషన్లకు ఆమోదం ..      -> జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ని గెలిపించాలి..

కెరటంలా దూసుకొస్తున్న మోంథా తుఫాన్

ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు


Date : 27 October 2025 07:58 PM Views : 86

సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / విశాఖ పట్నం : మోంథా తుఫాన్ కెరటంలా దూసుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. రాగల 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయింది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచింది. నెల్లూరు ,ప్రకాశం ,తిరుపతి, చిత్తూరు ,అన్నమయ్య ,అనంతపురం ,కర్నూలు ,నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలలో ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా క్లౌడ్ బ్రస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

విశాఖ, అల్లూరి, అనకాపల్లి, విజయనగరం, మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ ఉభయగోదావరి, కృష్ణ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాలను రెడ్ అలర్ట్ గా ప్రకటించారు. నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య , తిరుపతి జిల్లాలను ఆరంజ్ అలర్ట్ గా ప్రకటించారు. నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.కాకినాడకు 570 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైనట్లు తెలుస్తోంది. మంగళవారం కాకినాడ పరిసరాల్లో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు రైళ్ళు రద్దు చేసింది.

Cyber City News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Cyber City News 2025. All right Reserved.