Thursday, 27 November 2025 07:18:55 PM
 BREAKING NEWS
     -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..      -> ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత ... గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు..      -> మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం....      -> గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్ ..      -> చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన ..      -> కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ...జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్..      -> కాశీ బుగ్గ తొక్కిసలాటలో 9 మృతి,మృతుల సంఖ్య పెరిగే అవకాశం..      -> మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు భారత్ ..      -> హైదరాబాద్ కు తుఫాన్ ఎఫెక్ట్ ..      -> కెరటంలా దూసుకొస్తున్న మోంథా తుఫాన్..      -> మియాపూర్ డిపో, బస్ బాడీలలో ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి ఆకస్మిక తనిఖీ ..      -> ఉత్సాహంగా ఉమెన్స్ నైట్ రన్..      -> దొంగలపై డీసీపీ కాల్పులు... ఒకరికి గాయాలు..      -> వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం... 20 మంది కి పైగా మృతి..      -> జూబ్లీహిల్స్ లో 81 నామినేషన్లకు ఆమోదం ..      -> జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ని గెలిపించాలి..

కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ...జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్


Date : 01 November 2025 11:57 PM Views : 37

సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఒక్క ఛాన్స్ ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఆదివారం రాత్రి బొరబండలో కార్నర్ మీటింగ్ లో సీఎం ప్రసంగించారు. బోరబండ సమస్యల పరిష్కారానికి నవీన్ యాదవ్ కృషి చేస్తారని తెలిపారు. బిజెపి టిఆర్ఎస్ పార్టీలు కుమ్ముకై రాజకీయాలు చేయడాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.

చెల్లికి అన్నం పెట్టని వ్యక్తి చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేయిస్తాడాని ఆయన ప్రశ్నించారు. చెల్లె కవితకు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లో నుంచి బయటకు పంపారని పేర్కొన్నారు. బోరబండ చౌరస్తాను పీజెఆర్ చౌరస్తాగా మారుస్తామన్నారు. పి జె ఆర్ విగ్రహం ఏర్పాటు చేసి జూబ్లీహిల్స్ సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు కేటాయిస్తామని, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత తనదేనన్నారు. మోడీ ఏమి ఇచ్చారని జూబ్లీహిల్స్ లో బిజెపి నాయకులు ప్రచారానికి వస్తారని సీఎం ప్రశ్నించారు. మూడుసార్లు మోదీ ప్రధానమంత్రి, రెండుసార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రేషన్ కార్డులు ఇచ్చారా అని ఆయన గుర్తు చేశారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు, సన్న బియ్యం ఇచ్చారా అని పెద్దవ చేశారు. ఈ కార్యక్రమంలో పీసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అజారుద్దీన్ నాయకులు పాల్గొన్నారు.

Cyber City News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Cyber City News 2025. All right Reserved.