Wednesday, 04 March 2026 02:27:31 PM
 BREAKING NEWS
     -> . 2200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా - 11 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి స్వాధీనం - మొండికుంట‌ చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌ - ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు..      -> హెచ్ సి యు లో 50 ల్యాప్ టాప్ల చోరీ సి ఆర్ రావు ఇనిస్టిట్యూట్ లో ఘటన సెక్యూరిటీ కళ్ళు కప్పి చోరీ ..      -> కూలిన విమానం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం బారామతిలో ల్యాండ్ అవుతుండగా ఘటన..      -> ఫాస్టాగ్ ఉంటేనే బండి కదులుతుంది ఏప్రిల్ ఒకటి నుంచి ఫాస్ట్ ట్రాక్ తప్పనిసరి ..      -> చైనా మాంజా తాకి యువకుడికి తీవ్ర గాయం యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఘటన..      -> మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ఇక్ఫాయ్ విద్యార్థులు మృతి యువతకి తీవ్ర గాయాలు ..      -> గోపన్ పల్లి లో బెల్ట్ షాపు వద్ద గలాట ఇరు వర్గాలు పరస్పర దాడులు 18 మంది పై కేసు నమోదు..      -> జిహెచ్ఎంసి వార్డుల డిలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల 12 జోన్లు 60 సర్కిళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన ..      -> ఆ ఊర్లో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకం పై నిషేధం - జనవరి 26 నుంచి అమలు..      -> అంగట్లో సరుకుల్లా శిశువుల అక్రమ రవాణా - మియాపూర్ లో పట్టుబడ్డ 11 మంది సభ్యుల ముఠా - అహ్మదాబాద్, రామాయంపేటలో శిశువుల కొనుగోలు ..      -> చందా నాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులకు అస్వస్థత..      -> దేవుని మాన్యం లో కాసుల వల బడా బిల్డర్ డబ్బు పంపిణీ తో ఊరంతా పండగే..      -> గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో 25 మంది మృతి, ఆరుగురికి గాయాలు ..      -> ప్రయాణికులకు రూ.610 కోట్లు చెల్లించిన ఇండిగో విమాన సంస్థ..      -> ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్..      -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెడితేనే జీతాలు వస్తాయి

మాజీ మంత్రి హరీష్ రావు


Date : 21 October 2025 02:18 PM Views : 163

సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెడితేనే బస్తీ దవాఖాన ఉద్యోగులకు జీతాలు వస్తాయని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బస్తి దావఖానాలకు సుస్తీ పట్టిందని ఆయన విమర్శించారు. మంగళవారం శేర్లింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు . ఆసుపత్రిలోని సౌకర్యాలు, మందులు, ఉద్యోగుల జీతాలపై ఆరా తీశారు. డాక్టర్లకు రెండు నెలలుగా, స్టాఫ్ నర్స్ కు ఐదు నెలలుగా, సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని మాజీ మంత్రి వద్ద గోడు వెల్లబోసుకున్నారు.

బస్తీ దవాఖానాలకు సుస్తీ నెల నెల జీతాలు ఇవ్వకుంటే పేదలకు వైద్యం చేసే డాక్టర్లు సిబ్బంది ఎలా విధులు నిర్వహిస్తారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 450 బస్తీ దవాఖానలు, హైదరాబాదులో 350 దవాఖానలు ఏర్పాటు చేసిందన్నారు. 110 రకాల మందులను ఉచితంగా అందజేసి, 134 రకాల పరీక్షలు చేసి రోగుల మొబైల్ ఫోన్స్ కు పంపించేది అన్నారు. 60, 70 రకాల మందులు మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బస్తీ దవాఖానాలను నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కెసిఆర్ కిట్ ను పేరు మార్చి ఇచ్చి పేదలను ఆదుకోవాలనీ సూచించారు. ఒకటో తారీకు న జీతాలు ఇస్తున్నామన్న ప్రభుత్వం వాస్తవాలను పరిగణలోకి తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం మళ్లీ నల్లా బిల్లులు, కరెంట్ బిల్లులను పంపుతుందని జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు.

Cyber City News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Cyber City News 2026. All right Reserved.