Thursday, 15 January 2026 08:53:14 AM
 BREAKING NEWS
     -> చైనా మాంజా తాకి యువకుడికి తీవ్ర గాయం యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఘటన..      -> మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ఇక్ఫాయ్ విద్యార్థులు మృతి యువతకి తీవ్ర గాయాలు ..      -> గోపన్ పల్లి లో బెల్ట్ షాపు వద్ద గలాట ఇరు వర్గాలు పరస్పర దాడులు 18 మంది పై కేసు నమోదు..      -> జిహెచ్ఎంసి వార్డుల డిలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల 12 జోన్లు 60 సర్కిళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన ..      -> ఆ ఊర్లో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకం పై నిషేధం - జనవరి 26 నుంచి అమలు..      -> అంగట్లో సరుకుల్లా శిశువుల అక్రమ రవాణా - మియాపూర్ లో పట్టుబడ్డ 11 మంది సభ్యుల ముఠా - అహ్మదాబాద్, రామాయంపేటలో శిశువుల కొనుగోలు ..      -> చందా నాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులకు అస్వస్థత..      -> దేవుని మాన్యం లో కాసుల వల బడా బిల్డర్ డబ్బు పంపిణీ తో ఊరంతా పండగే..      -> గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో 25 మంది మృతి, ఆరుగురికి గాయాలు ..      -> ప్రయాణికులకు రూ.610 కోట్లు చెల్లించిన ఇండిగో విమాన సంస్థ..      -> ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్..      -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..      -> ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత ... గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు..      -> మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం....      -> గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్ ..      -> చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన ..

విద్యలో పెట్టుబడి ... భవిష్యత్తుకు బలమైన పునాది

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్


Date : 22 October 2025 08:38 PM Views : 120

సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : విద్యలో ఖర్చుపెట్టడం అంటే భవిష్యత్తును నిర్మించడం” అని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బుధవారం ఎస్‌.ఆర్‌. శంకరన్ జయంతి సందర్భంగా గౌలీదొడ్డి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) కళాశాలలో విద్యార్థులతో మమేకామయ్యారు.ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక న్యాయానికి ప్రతీకగా సేవా తపన కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారి శంకరం నిలుస్తారనికితాబునిచ్చారు. పేదలు, దళితులు, గిరిజనులు, బడుగు వర్గాల జీవితాలలో వెలుగు నింపేందుకు ఆయన అహర్నిశలు కృషి చేశారని తెలిపారు.

దళితుల సంక్షేమం కోసం ప్రత్యేక హాస్టల్ వ్యవస్థను ప్రారంభించి గురుకుల విద్యకు పునాది వేశారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నవారు న్యాయం చేయాలి అనే సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం విద్యా రంగంలో పలు విప్లవాత్మక చర్యలు చేపట్టిందన్నారు. ఈ క్రమంలో ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు, అన్ని సంక్షేమ హాస్టళ్లకు మౌలిక సదుపాయాల అభివృద్ధి, భద్రత, స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని యోగ, ధ్యానం, కౌన్సెలింగ్ ప్రోగ్రామ్స్ ప్రారంభించామని తెలిపారు. చదువు అన్నది గొప్ప ఆస్తి. ఎక్కడికి వెళ్లినా మీ చదువే మీ పరిచయం అని మంత్రి విద్యార్థులకు సూచించారు. ఎమ్మెల్య గాంధీ సందేశం గౌలీదొడ్డి గురుకుల కళాశాల డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి రూ.1.5 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేశామన్నారు. ఇక్కడి విద్యార్థులు భవిష్యత్తులో రాష్ట్రం, దేశం గర్వించేటట్లు ఎదగాలని నా ఆకాంక్ష” అని గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అంజయ్య కల్పన పాల్గొన్నారు.

Cyber City News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Cyber City News 2026. All right Reserved.