సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : విద్యలో ఖర్చుపెట్టడం అంటే భవిష్యత్తును నిర్మించడం” అని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బుధవారం ఎస్.ఆర్. శంకరన్ జయంతి సందర్భంగా గౌలీదొడ్డి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) కళాశాలలో విద్యార్థులతో మమేకామయ్యారు.ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక న్యాయానికి ప్రతీకగా సేవా తపన కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారి శంకరం నిలుస్తారనికితాబునిచ్చారు. పేదలు, దళితులు, గిరిజనులు, బడుగు వర్గాల జీవితాలలో వెలుగు నింపేందుకు ఆయన అహర్నిశలు కృషి చేశారని తెలిపారు.
దళితుల సంక్షేమం కోసం ప్రత్యేక హాస్టల్ వ్యవస్థను ప్రారంభించి గురుకుల విద్యకు పునాది వేశారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నవారు న్యాయం చేయాలి అనే సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం విద్యా రంగంలో పలు విప్లవాత్మక చర్యలు చేపట్టిందన్నారు. ఈ క్రమంలో ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు, అన్ని సంక్షేమ హాస్టళ్లకు మౌలిక సదుపాయాల అభివృద్ధి, భద్రత, స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని యోగ, ధ్యానం, కౌన్సెలింగ్ ప్రోగ్రామ్స్ ప్రారంభించామని తెలిపారు. చదువు అన్నది గొప్ప ఆస్తి. ఎక్కడికి వెళ్లినా మీ చదువే మీ పరిచయం అని మంత్రి విద్యార్థులకు సూచించారు. ఎమ్మెల్య గాంధీ సందేశం గౌలీదొడ్డి గురుకుల కళాశాల డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి రూ.1.5 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేశామన్నారు. ఇక్కడి విద్యార్థులు భవిష్యత్తులో రాష్ట్రం, దేశం గర్వించేటట్లు ఎదగాలని నా ఆకాంక్ష” అని గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అంజయ్య కల్పన పాల్గొన్నారు.
Cyber City NewsAdmin