Thursday, 27 November 2025 07:18:58 PM
 BREAKING NEWS
     -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..      -> ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత ... గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు..      -> మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం....      -> గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్ ..      -> చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన ..      -> కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ...జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్..      -> కాశీ బుగ్గ తొక్కిసలాటలో 9 మృతి,మృతుల సంఖ్య పెరిగే అవకాశం..      -> మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు భారత్ ..      -> హైదరాబాద్ కు తుఫాన్ ఎఫెక్ట్ ..      -> కెరటంలా దూసుకొస్తున్న మోంథా తుఫాన్..      -> మియాపూర్ డిపో, బస్ బాడీలలో ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి ఆకస్మిక తనిఖీ ..      -> ఉత్సాహంగా ఉమెన్స్ నైట్ రన్..      -> దొంగలపై డీసీపీ కాల్పులు... ఒకరికి గాయాలు..      -> వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం... 20 మంది కి పైగా మృతి..      -> జూబ్లీహిల్స్ లో 81 నామినేషన్లకు ఆమోదం ..      -> జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ని గెలిపించాలి..

రిజర్వేషన్లు 50 శాతానికి మించ కూడదన్న సుప్రీంకోర్టు - పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని సూచన

తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ నిరాకరణ


Date : 16 October 2025 01:20 PM Views : 92

సైబర్ సిటీ న్యూస్ - జాతీయం / హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు నిరాకరించింది. గురువారం ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ల పేరిట జీవో నెంబర్ 9 జారీ చేసింది. జీవో పై తెలంగాణ హైకోర్టు స్టే విధిస్తూ విచారణ ఆరువారాలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని సుప్రీంకోర్టు సూచించింది. రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సంగ్వీ వాదనలు వినిపించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒకటి పకడ్బందీగా సర్వే నిర్వహించామని గవర్నర్ బిల్లు పెండింగ్ లో ఉందన్నారు. సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్ టెస్ట్ కండిషన్ లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని కోర్టుకు విన్నవించారు. హైకోర్టు స్టే ఇచ్చిందని మధ్యంతర తీర్పులో ఎలాంటి సహేతుక కారణాలు లేవని అన్నారు.

ప్రతివాది మాధవరెడ్డి తరపు లాయర్ వాదనలు వినిపిస్తూ 50 శాతానికి రిజర్వేషన్లు మించి ఉండకూడదని సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో స్పష్టం చేసిందన్నారు. గిరిజన ప్రాంతాలలో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేసేందుకు వీలుందని తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ప్రాంతాలు లేవన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్ల పెంపును తిరస్కరించిందని గుర్తు చేశారు.

Cyber City News

Admin

Copyright © Cyber City News 2025. All right Reserved.